• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » శాంతించిన గోదావరి.. ఆ 8 జిల్లాల్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్

శాంతించిన గోదావరి.. ఆ 8 జిల్లాల్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్

Last Updated: July 12, 2022 at 10:36 am

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడొచ్చని అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ కొనసాగుతోంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.

ఈ 3 రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని పేర్కొంది. ఆ ప్రభావంతో రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని.. దాంతో మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది.

ముఖ్యంగా రెండురోజులపాటు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండుల్లా మారాయి. అయితే.. గోదావరి ఉద్ధృతి కాస్త తగ్గింది. భద్రాచలంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు అధికారులు.

ఇటు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్‌ సాగర్‌ ఫుల్ అయింది. కూకట్‌పల్లి నాలా నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది. వరద నీటిని తూముల ద్వారా బయటికి విడుదల చేశారు.

మరోవైపు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్‌ సాగర్‌ ఇన్‌ ఫ్లో 250, ఔట్‌ ఫ్లో 312 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1786 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. అలాగే.. హిమాయత్‌ సాగర్‌ ఇన్‌ ఫ్లో 500, ఔట్‌ ఫ్లో 515 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1760 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు.

Primary Sidebar

తాజా వార్తలు

ధ్యానంతో ప్రశాంతం.. శ్రీరామచంద్ర సంస్థ ఉచిత శిక్షణ!

రూ. 500 విషయంలో గొడవ… స్నేహితుడి తలను కత్తితో నరికి…!

అడుగ‌డుగున‌.. అడ్డంకులు..సొమ్మ‌సిల్లిన భ‌ట్టి!!

బిగ్ బాస్ సీజన్ 6 క్రేజీ అప్ డేట్

సంక్షేమంపై కేసీఆర్​కు సోయి లేదు!

ఆ నిర్ణయాన్ని సమర్థించుకున్న విదేశాంగ మంత్రి…!

అందాల ట్రీట్ ఇచ్చిన అనన్య…!

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో…!

అమెరికాలో రెస్టారెంట్ కు వెళ్లిన కేంద్ర మంత్రి… అక్కడ జరిగింది తెలిస్తే..!

తుగ్ల‌క్ పాల‌న గుర్తుకు వ‌స్తోంది!!

ఎత్తిన జెండాను ఏం చేయాలి?

మునుగోడు గెలుపు పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

ఫిల్మ్ నగర్

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో...!

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో…!

అత‌నంటే ఇష్టం: అన‌న్య పాండే

అత‌నంటే ఇష్టం: అన‌న్య పాండే

మ‌హాన‌టిగా ఆమెను వ‌ద్ద‌న్నాను!!

మ‌హాన‌టిగా ఆమెను వ‌ద్ద‌న్నాను!!

ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌నితో సినిమాలు చేయ‌ను!!

ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌నితో సినిమాలు చేయ‌ను!!

నా జాస్మిన్ ఆనందంగా క‌నిపించ‌డం లేదు!!

నా జాస్మిన్ ఆనందంగా క‌నిపించ‌డం లేదు!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)