నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం నుంచి సోమవారం ఎల్లుండి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇందులో భాగంగానే తెలంగాణలో 9వ తేదీన అత్యంత భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.కాగా శనివారం ఆరెంజ్, ఆదివారం రెడ్ అలర్ట్లను జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ముఖ్యంగా 11 వ తేదీన కోస్తాంధ్ర,తెలంగాణ యానాంలో భారీ వర్షాలు పడనుందని ఐఎండీ వివరించింది. శనివారం తెలంగాణలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు.
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్ననేపథ్యంలో ఆ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ను ప్రకటించారు.