నందమూరి బాలకృష్ణకు ఇతిహాసాలు, రామాయణ, మహాభారతాల మీద మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి బాలయ్యే ఓ చిన్న తప్పు చేశాడు. వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణ బ్రహ్మ అని అన్నాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ మాట్లాడొద్దని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ, తెలంగాణలోని దేవాంగులు దీనిపై సీరియస్ అయ్యారు. పలువురు నాయకులు బాలకృష్ణని విమర్శించారు, క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేశారు. తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.
అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు, నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా?. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’.. ఇట్లు మీ బాలకృష్ణ అని రాశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
From the desk of Actor & Leader Nandamuri Balakrishna Garu#NandamuriBalakrishna pic.twitter.com/FbnqeOK4yA
— Vamsi Kaka (@vamsikaka) January 15, 2023