ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. మహేష్ బాబు న్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా 2024 సంక్రాతి బరిలో నిలిచింది.
ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగక్కి జనవరి 13న థియేటర్లలోకి రానుందని.. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్.. ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ మాసీ లుక్ లో చేతిలో సిగరేట్ తో ఉన్నాడు.
ప్రస్తుతం హైదరాబాద్ శివారులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో పూజా హెగ్డే, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కాగా అతడు, ఖలేజా తర్వాత.. సుమారు పదమూడు ఏళ్ళ విరామం తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది. అయితే ఈ నెల 30న శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH
— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023