ఏపీలో సినిమా టికెట్ల పై హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా పడింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు ఏపీ ప్రభుత్వం వెళ్లిన సంగతి తెలిసిందే. జీవో 35 సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. అయితే సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టికెట్ ధరల పై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధర నిర్ణయం లో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.