రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ పై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, 2 నెలల్లో అన్ని విద్యా సంస్థల్లో సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వానికి సూచనలు చేసింది.
రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో 10శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయన్న హైకోర్టు, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ కార్యచరణ ప్రణాళికలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని డీహెచ్ ను హైకోర్టు ప్రశ్నించగా… సీసీజీఆర్ఏపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. దీంతో మీరు ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా అంటూ హైకోర్టు ఆగ్రహం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్య్తం చేసింది. ఇంకా ఎంత మంది మరణించాక చేరుస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కరోనాపై తదుపరి విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.