కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నలుగురు పోలీస్ అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. భార్యాభర్తల వివాదం కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీం నిబంధనల మేరకు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే.. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును 6 వారాలు నిలిపివేసింది హైకోర్టు.