ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి వేసిన పిటిషన్పై ఈ రోజు విచారణ జరిగింది. సిట్ దర్యాప్తునకు సహకరించాల్సిందిగా తుషార్కు న్యాయస్థానం సూచించింది.
కానీ తుషార్ను అరెస్టు చేసేందుకు మాత్రం వీల్లేదని హైకోర్టు తెలిపింది. 41-ఏ నోటీసు ఇచ్చి ఆ తర్వాత నిందితుల జాబితాలో తుషార్ పేరును చేర్చారని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారని ఈ సందర్బంగా ఆయన వాదించారు.
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై స్టే విధించాలని పిటిషన్లో తుషార్ కోరారు. ఈ పిటిషన్లో సీఎం కేసీఆర్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని ఆయన కోర్టుకు తెలిపారు.
ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఈ నెల 16న తనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అనారోగ్యం నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ సిట్కు మెయిల్ చేసినట్లు ఆయన చెప్పారు. అయితే, తన మెయిల్కు సమాధానం ఇవ్వలేదని, వెంటనే లుకౌట్ నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ దురుద్దేశమే అవుతుందని తుషార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.