సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో భారీ భూ కుంభకోణంపై వస్తోన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. సర్వే నెంబర్ 261లోని మొత్తం 588 ఎకరాల భూ అక్రమ లావాదేవీలు, అక్రమ లేఅవుట్లపై వివరణ కోరింది హైకోర్టు. 27 మంది రెవెన్యూ, పంచాయతీ ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసింది.
రిట్ పిటిషన్ ఎందుకు స్వీకరించరాదో.. మార్చి 27వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్, జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు.
వేలకోట్ల రూపాయల ప్రభుత్వ అసైన్డ్, పేదల పట్టా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ ల్యాండ్స్ అన్యాక్రాంతంపై, అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూడడంపై విస్మయం చెందింది హైకోర్టు.
పంచాయతీ నిధులు వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల సొంత ఖాతాల్లో చెక్ ల ద్వారా బదిలీ అవడంపై, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ గా.. ప్లాన్ ప్రకారం నిధులు దుర్వినియోగం అవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.