సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్ట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మొదట బయోపిక్ అని ఇప్పుడు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి. సినిమాను కేవలం వినోదపరంగానే చూడాలని, ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లు ఎవరూ చూపించలేరని, కల్పిత పాత్రలతో చూపిస్తారని కోర్టు అభిప్రాయపడింది. గతంలో గాంధీజీ, మొగల్ల సామ్రాజ్యపు చిత్రాలను ప్రస్తావించిన హైకోర్ట్, సినిమా నచ్చేది లేనిది ప్రేక్షకులకు వదిలేయాలని స్పష్టం చేసింది. రిలీజ్కు ముందురోజున సినిమా విడుదలను తాము ఆపలేమన్న కోర్ట్, పిటిషన్ను కట్టివేసింది.