తెలంగాణలోని ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలని కోరుతూ విజయశాంతి హైకోర్ట్ లో ఫిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ చేపట్టిన దర్మాసనం.. సంచలన తీర్పును ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోకాపేట్, ఖానామెట్ భూములను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నేత విజయశాంతి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది. ఆ భూములపై పూర్తి హక్కు ప్రభుత్వానికే ఉంటుందని కోర్ట్ పేర్కొంది.
అయితే.. హెచ్ఎండీఏ పరిధిలోని భూముల వేలం కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని విజయశాంతి కోరారు. నిధుల సమీకరణ కోసం విలువైన ప్రభుత్వ భూములు అమ్మడం సమంజసం కాదని.. అందుకు నిరాకరించాలని కోరుతూ ఆమె ఫిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఉత్తర్వులకు తానే విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్ లో విజయశాంతి ఆరోపించారు.
ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ప్రతివాదులుగా పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. తాజాగా సర్కారు భూములను విక్రయించడం తప్పుబట్టలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. భూముల విక్రయంలో టెండర్లు, వేలం వంటి వాటిల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని సూచించింది హైకోర్ట్.