తెలంగాణలో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది.
అనుమతి లేని లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 5 వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వేల సంఖ్యలో పిటిషన్లు వస్తుండడంతో కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది న్యాయస్థానం. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి అంతా ఉంటుందని డాక్యుమెంట్లలో రాయాలని స్పష్టం చేసింది. అలాగే ఈసీ, వెబ్ సైట్ లోనూ పేర్కొనాలని తెలిపింది హైకోర్టు.
Advertisements
ఎఫ్టీఎల్, బఫర్ జోన్, 30 అడుగుల రోడ్డు లేని ప్లాట్ల కొనుగోళ్లపై హెచ్చరించాలన్న న్యాయస్థానం.. చట్ట ఉల్లంఘనలపై కొనుగోలుదారులదే బాధ్యత అని డాక్యుమెంట్ లో రాయాలని స్పష్టం చేసింది.