హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టేసింది. కిలారు రాజేష్తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని ప్రభుత్వం తాను వేసిన పిటిషన్లో పేర్కొంది. అయితే భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని… ప్రభుత్వమే కక్షసాధిస్తోందని కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ వేశారు. అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో వాదనలు వినిపించారు.
ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్లు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ కేసులు నమోదు చేసింది.