దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సహలతో కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో మహాకాలేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రంలో మంగళవారం వేడుకగా హోలీ పర్వదినాన్ని జరిపారు.
మహాకాలుడికి భస్మ హారతి నిర్వహించే సమయంలో గులాబీ రంగులతో పూజలు నిర్వహించారు.శివుడిని అలకరించిన తర్వాత పూజారులు ఆలయ గర్భగుడిలో గులాల్ రంగులు చల్లుకున్నారు. భస్మ హారతిని వీక్షించేందుకు వచ్చిన భక్తుల పై కూడా ఆ రంగులు చల్లారు.
ఉత్తర భారత దేశంలో హోలీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సహాల్లో తేలిపోతున్నారు. బెంగాల్లో డోల్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు ఒకరికి ఒకరు గులాల్ రాసుకుంటూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.