2022 ఆస్కార్ బ్యాలెట్లు లెక్కించబడ్డాయి. ఇప్పటికే పేర్లన్నీ సీలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే భారతీయ ట్విట్టర్ వినియోగదారులు నటుడు సూర్య నటించిన జై భీమ్ను అనుసరించడం ప్రారంభించారు. జడ్జి చంద్రు నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓటిటి వేదికగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
సూర్య, జ్యోతిక అమెరికా వెళ్లే అవకాశం ఉంది:
ఈ చిత్రం ఫిబ్రవరి 19న యునైటెడ్ స్టేట్స్లో జరగనున్న 11వ వార్షిక కాంగ్రెషనల్ గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ 2021 బరిలో నిలిచింది. ఇక జై భీమ్ కోసం గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డులను అందుకోవడానికి సూర్య జ్యోతిక యునైటెడ్ స్టేట్స్ వెళ్లనున్నారట. ఇప్పటికే సూర్య, జ్యోతిక, TJ జ్ఞానవేల్, జడ్జి చంద్రులకు ఆహ్వానం వచ్చిందని సమాచారం.
హాలీవుడ్ విమర్శకులు జై భీమ్ గురించి ట్విట్టర్లో మాట్లాడుతున్నారు:
ఈ చిత్రం హాలీవుడ్ విమర్శకుల ద్వారా ఈరోజు ట్విట్టర్ చర్చలో కనిపించింది. న్యూయార్క్ టైమ్స్ చలనచిత్ర విమర్శకుడు కైల్ బుచానా ట్విట్టర్లో ఒక ప్రశ్నను సంధించారు. రేపు ఉదయం మీ నుండి ఏ ఆస్కార్ నామినేషన్కు అత్యధిక స్పందన లభిస్తుంది? అంటూ ప్రశ్న వేశారు.
దీనిపై రాటెన్ టొమాటోస్ అవార్డుల ఎడిటర్ జాక్వెలిన్ కోలీ, సూర్య గురించి ప్రస్తావిస్తూ కైల్కి ఆన్సర్ ఇచ్చారు. ఉత్తమ చిత్రం #జైభీమ్. దీనిపై నన్ను నమ్మండి అంటూ ఆమె రాసింది. అలాగే హాలీవుడ్ రిపోర్టర్ కాలమిస్ట్ స్కాట్ ఫీన్బెర్గ్ దీనిపై స్పందిస్తూ… ఇది ఖచ్చితంగా అకాడెమీ స్క్రీనింగ్ రూమ్లో ఉంది! అంటూ తెలిపారు. దీనికి జాక్వెలిన్ బదులిస్తూ, మొత్తం ఖండం ఓడిపోతుంది. నమ్మండి అంటూ తెలిపింది.
ఇక జైభీమ్ చిత్రం కు ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్లో 1.8 మిలియన్లకు పైగా వీక్షణలను వచ్చాయి. ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోగా ఇది నిలిచింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.