• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » 11 ప్రాణాలు.. బుగ్గిపాలు! వలసొచ్చి వల్లకాటికి..!

11 ప్రాణాలు.. బుగ్గిపాలు! వలసొచ్చి వల్లకాటికి..!

Last Updated: March 24, 2022 at 7:20 am

– తెల్లవారుజామున తెల్లారిన బతుకులు
– సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం
– 11 మంది సజీవ దహనం
– రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల విచారం
– ప్రమాద ఘటనతో ప్రభుత్వంలో చలనం
– ఇతర గోదాములపై ఫోకస్

పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. రెక్కాడితే గానీ డొక్కాడదు. పని చేస్తేనే నాలుగు వేళ్లు లోపలికి వెళ్లేది. లేకపోతే పస్తులే. రెక్కలు ముక్కలు చేసుకుని పొట్టపోసుకునే శ్రమ జీవులు వారంతా. కానీ.. పని చేసే ఆ ప్రాంతమే నరకకూపంలా మారింది. రోజూ సంతోషంగా తిరిగిన అక్కడి గదులే యమపాశం విసిరాయి. ఇదంతా బోయగూడ అగ్నిప్రమాదంలో బుగ్గిపాలైన కూలీల బతుకు చిత్రం.

బుధవారం ఉదయం 3 గంటల తర్వాత శాద్వన్ స్క్రాప్ గోడౌన్‌ లో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులంతా బీహార్ వాసులు. కూలీ పని కోసం నగరానికి వలస వచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని దాదాపు 3 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

11 మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాద సమయంలో మంటలను చూసి భయపడి తాము ఉంటున్న గదుల్లోకి వెళ్లారు బాధితులు. మంటలు వేగంగా వ్యాపిస్తూ వారిని చుట్టుముట్టాయి. ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో కాలి బూడిదయ్యారు వారంతా. మృతదేహాలను గుర్తించే క్రమంలో కొన్ని ఒక దానిపై ఒకటి పడి ఉన్నాయని పోలీసులు వివరించారు. డెడ్ బాడీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు.

ఇటు ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. ప్రమాదంపై పోలీస్, జీహెచ్ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు హోంమంత్రి మహమూద్ అలీ. ఎక్కడెక్కడ ఇలాంటి గోదాములు ఉన్నాయో. ఎంతమంది పని చేస్తున్నారో వివరాలు సేకరించాలని అదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇళ్ల మధ్య ఉన్న గోదాములను గుర్తించాలని ఆదేశించారు.

రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపింది.

ఘటనపై ప్రముఖుల స్పందన ఇదే..!

రామ్ నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి- సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో కార్మికులు మృతి చెందడం మాటల్లో చెప్పలేని విషాదం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలి.

నరేంద్ర మోడీ, భారత ప్రధాని- అగ్నిప్రమాదంలో కూలీలు చనిపోవడం బాధాకరం. ఈ ధుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేస్తాం.

కేసీఆర్, తెలంగాణ సీఎం- బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు సీఎస్ ఏర్పాట్లు చేయాలి. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి.

బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు- పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అనుమతుల నుంచి ఫైర్ సేఫ్టీ చర్యల వరకు అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్- అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

క్యుములోనింబస్‌ మేఘాల ప్ర‌భావం.. తెలంగాణలో ఎల్లో అల‌ర్ట్..!

ఉత్కంఠ పోరులో రాజ‌స్థాన్ విజ‌యం.. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి..!

పంజాబ్ రైతులను ఆదుకుంటావ్ సరే.. రాష్ట్ర రైతులను ఎవరు ఆదుకోవాలి..?

మా నాన్నను చాలా మిస్ అవుతున్నాను

మంకీ పాక్స్ పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు…!

బ్రేకింగ్… మరో పరువు హత్య.. 20 సార్లు పొడిచారు!

పంజాబ్ రైతులకు సాయం.. కేసీఆర్ డ్రామా

రేపు ఆలేరులో రచ్చబండ కార్యక్రమాలు!

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మధ్య తేడా ఏంటీ…?

వేడి వేడి పాన్ మీద నీళ్ళు పోయడం కరెక్టేనా…?

వీసా స్పాన్సర్ చేయడం అంటే ఏంటీ…?

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

ఫిల్మ్ నగర్

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

శేఖర్ మూవీ రివ్యూ

శేఖర్ మూవీ రివ్యూ

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)