తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం ఏర్పడటంతో అధికారులు లెక్కింపు నిలివేశారు.
సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో భాగంగా ఎనిమిది మంది ఎలిమినేషన్లో 50 ఓట్లు గల్లంతైనట్లు సిబ్బంది తెలిపారు. అయితే, ఓట్ల గల్లంతుపై భాజపా, కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు నిలిపివేశారు. మరోవైపు నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 48 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు.