కరోనా వైరస్ దాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచం నలుమూలలా విస్తరించిన ఈ వైరస్… జనాన్ని, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతులం చేస్తోంది. దీంతో అన్ని దేశాల శాస్త్రవేత్తలు, ప్రైవేటు ఫార్మా కంపెనీలన్నీ వ్యాక్సిన్ కనుకునేందుకు బిజీగా ఉన్నాయి.
అయితే, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసే బయోలజికల్ ప్రొఫెసర్ సిమా మిశ్రా కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందడుగు వేశారు. కరోనా వైరస్ కారణంగా శరీరంలో చనిపోయిన కణాలను తిరిగి ఉత్తేజం చేసే అణువులు కల వ్యాక్సిన్ ను డెవలప్ చేశారు. అయితే… ఇది ఇప్పటికప్పుడు వాడుకలోకి వచ్చే అవకాశం లేదు. దీనిపై భారతీయ శాస్త్రవేత్తల్లో చర్చ జరగటంతో పాటు ఔషధ నియంత్రణ మండలి, భారత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని ప్రకటించారు.
ఈ మందుకు టీ-సెల్ ఎపిటోమ్ అనే పేరు పెట్టారు.