బీఆర్ఎస్ ఖమ్మం సభకు రాని జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సభకు వెళ్లలేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆసక్తికర జవాబిచ్చారు. కేసీఆర్ నిర్వహించిన సభ గురించి అసలు నాకేం తెలియదన్న ఆయన తనకు సభ గురించి ఎటువంటి సమాచారం లేదని ఆశ్చర్యపర్చారు.
నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని.. ఆయన పార్టీ సభకి ఆహ్వానం అందిన వారు వెళ్లారు..మీరు ఈ ప్రశ్నలు వారిని అడగాలి..అని నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం టీఎంసీ ఎంపీ శాంతను సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ జాతీయ రాజకీయాల్లో విఫలమైందన్నారు. కాగా జాతీయ స్థాయిలో తమ పార్టీ తొలి సభతో కాంగ్రెసేతర ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణ సీఎం తొలి అడుగు వేశారని అన్నారు.
ఇక థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని, కాంగ్రెస్ ప్రమేయం ఉన్న ఫ్రంట్ ఉండాలని అన్నారు. అప్పుడే 2024 లో బీజేపీని ఓడించగలం అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీనీ ఓడించేందుకు ఎవరైనా వేదిక సిద్ధం చేసుకోవచ్చు. బీజేపీని ఓడించేందుకు బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దీని తర్వాతే ఎవరిని బరిలోకి దింపాలనేది తేల్చవచ్చు అని ఆయన అన్నారు.
కేసీఆర్ తో పాటు ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ స్థానం కోసం చాలా మంది పోటీ పడ్డారన్నారు. మమతా బెనర్జీ కూడా రేసులో ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ జాతీయ స్థాయికి చేరుకున్న తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న తొలి భారీ బహిరంగ సభ అని ఆయన్ను చాలా మంది ప్రధాన మంత్రి పదవి ఆశించే వ్యక్తిగా చూస్తున్నారన్నారు.