ప్రస్తుతం తాను బీజేపీ కార్యకర్తను మాత్రమేనన్న నాదెండ్ల భాస్కర్ రావు తనని మాజీ సీఎం అనొద్దని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్ లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నాదెండ్ల.. ఈ మధ్య తను బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్తే ఒకతను తనని ఆంధ్రావాడని అన్నాడని, అలా అన్నప్పుడు తానెంతో బాధపడ్డానని నాదెండ్ల చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో ముందుగా తెలంగాణ వాళ్లందరూ మాట్లాడిన తరువాత తాను మాట్లాడుతానని నాదెండ్ల అన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు నాదెండ్ల సమాధి వద్ద నివాళులర్పించారు. ఉమ్మడి ఏపీ రాజకీయాలపై చెన్నారెడ్డి చెరగని ముద్ర వేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రి పదవినే కాకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్,తమిళనాడు, పాండిచ్చేరి గవర్నర్ గా కూడా పనిచేశారు. 1996 డిసెంబర్ 2 న చెన్నారెడ్డి తుది శ్వాస విడిచారు.