• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ‘నేనూ మధ్యతరగతి మహిళనే’.. నమ్మాల్సిందేనా ?

‘నేనూ మధ్యతరగతి మహిళనే’.. నమ్మాల్సిందేనా ?

Last Updated: January 15, 2023 at 9:07 pm

 

బడ్జెట్ అంటేనే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో ‘బాంబు’ పేలినంత భయం ! రాయితీల తాయిలాల మాట అటుంచి ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, పన్నుల బాదుడు ఎలా ఉంటుందో.. ఆదాయపు పన్ను చెల్లింపు మినహాయింపుల వరాలు అసలు ఉంటుందో.. ఉండదో.. ఇలా ఎన్నో భయాలు సర్వ సాధారణం.. చూస్తుండగానే బడ్జెట్ సీజన్ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 1 న పార్లమెంటుకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పించనున్నారు.

 

I belong to middle class, understand their pressures: FM Sitharaman days  before Budget- The New Indian Express

 

ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ వీక్లీ మ్యాగజైన్ ‘పాంచజన్య’ నిర్వహించిన కార్యక్రమంలో.పాల్గొన్న ఆమె . ఎప్పుడూ చేయని వ్యాఖ్యలు చేశారు. తానూ మధ్యతరగతికి చెందిన మహిళనేనని, వారి కష్టాలు తనకు తెలుసునని అన్నారు. ‘ఐ ఐడెంటిఫై మైసెల్ఫ్ విత్ ది మిడిల్ క్లాస్..సో ఐ నో’ అన్నారామె.

మధ్యతరగతి వర్గాలపై ప్రభుత్వం కొత్తగా పన్నులు వేయలేదని, ఆదాయపు పన్ను నుంచి రూ. 5 లక్షల వరకు మినహాయింపు ఉందని గుర్తు చేశారు. మిడిల్ క్లాస్ వారి సమస్యలేమిటో తాను అర్థం చేసుకున్నానని, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.

2020 నుంచి ప్రతి బడ్జెట్లో సర్కార్ మూలధన వ్యయంపై కేటాయింపులను పెంచుతోందని, వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూ. 7.5 లక్షల కోట్లకు.. అంటే 35 శాతం పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఎకానమీ పై దీని ప్రభావాలు చాలా ఉంటాయన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఇవి సాగుతాయి. మధ్యంతర విరామంతో బాటు 66 రోజుల పాటు 27 సెషన్స్ ఉంటాయని సంబంధిత వర్గాలు ఇదివరకే తెలిపాయి.

 

Primary Sidebar

తాజా వార్తలు

ఏదీ సుపరిపాలన..? కేసీఆర్ కు బండి లేఖాస్త్రం..!

సిసోడియా భార్య ఆసుపత్రిలో.. చూసేందుకు తీసుకెళ్లిన జైలు సిబ్బంది!

సైబర్ మోసాలకు చెక్.. కొత్త BTech CSE సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్

జాతీయ రహదారిపై తప్పతాగి పడిఉన్న వ్యక్తి పట్టించుకోని పోలీసులు…!

క్యాంపు ఆఫీసులో ఉండగానే..!

మెట్రో ప్రయాణికులకు మరో షాకింగ్ న్యూస్‌!

రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక

ప్రజల ఆకాంక్షలు నెరవేరేది కాంగ్రెస్ తోనే!

తిరువన్నామలై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం..!

జూన్ 2న రికార్డ్ సృష్టించిన ఎండ

రైలు ప్రమాద ఘటన పై స్పందించిన ప్రముఖులు, రాజకీయ నాయకులు!

33 ఏళ్ల క్రితం మిస్సయ్యాడు…ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు?..ఎందుకొచ్చాడు..!?

ఫిల్మ్ నగర్

celebreties react on coromandel express train accident incident

రైలు ప్రమాద ఘటన పై స్పందించిన ప్రముఖులు, రాజకీయ నాయకులు!

Narasimha Naidu re release

బాలయ్య నుంచి మరో సినిమా రీ-రిలీజ్

PS2 free for prime subscribers

పొన్నియన్ సెల్వన్ 2.. ఇకపై ఉచితం

Who is the father of Ileana's unborn child

ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు?

Boyapati takes 24 days for action sequence

సింగిల్ సీక్వెన్స్ కి 24 రోజులు షూటింగ్

naga chaitanya to do his next with chandu mondeti

హిట్‌ కొట్టాలంటే ఆయనతోనే చేయాలి!

Adipurush countdown starts

ఆదిపురుష్.. కౌంట్ డౌన్ షురూ

hero sharwanand marriage haldi ceremony celebrations at jaipur palace

మొదలైన హీరో శర్వానంద్ పెళ్లి సందడి.. వీడియో వైరల్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap