ప్రజలకు మెరైగన రవాణా సేవలందించేందుకు ప్రధాని మోడీ వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిస్టాత్మకంగా తీసుకొచ్చారు. అప్పుడు ఇవి మురికి కూపాలుగా మారాయి. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు చెత్తతో నిండిపోయింది. దీన్ని గమనించిన రైల్వే అధికారులు.. రైలును పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. డస్ట్ బిన్ లను వాడాలని చెబుతున్నారు. అయితే వారి విజ్ఞప్తిని ప్రయాణికులు పట్టించుకోలేదని తెలుస్తోంది.
తాజాగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అవనీష్ శరణ్ వందేభారత్ లో రైలు లోపల చెత్త పేరుకున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ లో ‘వి ది పీపుల్’ అని రాశారు. ఆ ఫొటోలో ప్రయాణికులు ఉపయోగించిన అద్దాలు, నీళ్ల సీసాలు, ఆహార ప్యాకెట్లు, ప్లాస్టిక్ వస్తువులు అన్నీ నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలపై డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సారథి రియాక్ట్ అయ్యారు. ప్రయాణీకులను కోచ్ లను శుభ్రంగా ఉంచాలని, చెత్త పారేయడం కోసం డస్ట్ బిన్ లను ఉపయోగించాలని అభ్యర్థించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పౌరులు బాధ్యత వహించడం ప్రారంభించినప్పుడే స్వచ్ఛ భారత్ నినాదాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సహకరించాలని అనుప్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. శుభ్రం చేశాక.. ఒక కుప్పగా వేశారని కామెంట్లు చేస్తున్నారు.