• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » మోడీ ప్రారంభిస్తే రాబోం.. అసదుద్దీన్ ఒవైసీ

మోడీ ప్రారంభిస్తే రాబోం.. అసదుద్దీన్ ఒవైసీ

Last Updated: May 24, 2023 at 5:34 pm

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన పక్షంలో తాము ఈ కార్యక్రమానికి గైర్హాజరవుతామని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా .. ఈ భవనాన్ని ప్రారంభించాలని ఆయన అన్నారు. అయితే ఈ బిల్డింగ్ ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న పిలుపును తాము అంగీకరించబోమని, ఈ భవనం ఎంతో అత్యవసరమన్నది నిజమే అయినప్పటికీ మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. దీని ప్రారంభోత్సవ విషయంలో విపక్షాలు తనను కాంటాక్ట్ చేయలేదని, కానీ రాష్ట్రపతిని ఆహ్వానించాలన్నది రాజ్యాంగం ప్రకారం సరి కాదని అన్నారు. లోక్ సభకు స్పీకర్ ‘కస్టోడియన్’ అని, కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించాలని ఒవైసీ పేర్కొన్నారు.

Owaisi slams PM Modi visit construction new Parliament why was speaker not with him | India News – India TV

మోడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని స్పీకర్ చేత ప్రారంభింపజేయాలన్నారు. ఓం బిర్లా ఇనాగురేట్ చేస్తే మేం ఈ కార్యక్రమానికి హాజరవుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్న 19 విపక్షాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోడీ పూర్తిగా పక్కన బెట్టేయడం మన ప్రజాస్వామ్యానికి అవమానకరమే కాక.. నేరుగా దాడి చేసినట్టేనని  ఆరోపించాయి. ఈ నెల 28 న ప్రారంభోత్సవానికి నోచుకోనున్న కొత్త పార్లమెంట్ భవనానికి మోడీ 2020 డిసెంబరు 10 న శంకుస్థాపన చేశారు.

ఇందులో లోక్ సభ ఛాంబర్ లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్ లో 300 సీట్లు ఉన్నాయి. ఉభయ సభలను ఒకేసారి సమావేశపరచవలసి వస్తే లోక్ సభ ఛాంబర్ లో 1280 మంది సభ్యులు కూర్చునే సౌకర్యం ఉంది.

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలన్న విపక్షాల నిర్ణయంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. గత తొమ్మిదేళ్లలో అయిదు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కొత్త అసెంబ్లీ భవనాలకు శంకు స్థాపనలో, ప్రారంభోత్సవాలో చేశాయని, అయినా ఒక్కసారి కూడా గవర్నర్ ని గానీ, రాష్ట్రపతిని గానీ ఆహ్వానించలేదని అన్నారు. ఈ రాష్ట్రాల సీఎంలు గానీ, పార్టీ అధ్యక్షులు గానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

అధికారులకు కొత్త సమస్య… వాటిని భద్ర పరచడం కష్టమే….!

రాష్ట్రంలో భారీ వర్షం… పలు చోట్ల పిడుగులు…!

పర్యావరణ హితంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది…!

ఆ దుర్ఘటనపై సీబీఐ విచారణకు సిఫారసు… కేంద్ర మంత్రి వెల్లడి…!

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో వుంది…!

బాలుడిపై వీధి కుక్క దాడి!

కోరమాండల్ ప్రమాదం.. అనాథ పిల్లలకు అదానీ గ్రూప్ సాయం

పగిలిన భగీరథ పైప్ లైన్ ..ఎగసిపడిన నీళ్లు!

కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్…!

ఘనంగా సురక్షాదినోత్సవం!

కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…!

ఏ నిర్ణయం తీసుకోవడానికైనా టీజేఎస్ రెడీ!

ఫిల్మ్ నగర్

prasanth neel birthday celebrations in salar movie set

సలార్‌ సెట్లో పుట్టిన రోజు వేడుకలు..ఎవరవంటే?

i was troubled by that director kriti shetty comments

ఆ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డాను!

ilayaraja live concert at tana mahasabhalu

తానా సభల్లో ఇళయారాజా కచేరి!

megastar chiranjeevi on rumours of getting cancer

నేను అలా అనలేదు..అర్థాలు మార్చకండి!

actress anupama parameswaran interesting comments

జీవితం చాలా చిన్నది..టైం అయిపోగానే!

sonu sood reacts on odisha train accident

రైలు ప్రమాదం పై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

netizens fires on comedian rahul ramakrishna for his videos

ఈ సమయంలో ఇలాంటి వీడియోలా? కమెడియన్ పై నెటిజన్ల ఫైర్

megastar chiranjeevi shocking comments on cancer

నాకూ క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap