వర్షాకాలం మొదలవడంతోనే వరణుడు ప్రతాపం చూపాడు. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ కురిసాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అతాలాకుతలం అయింది. అయితే కాస్త విరామం దొరికింది అనుకునేలోపే వాతావరణ శాఖ చెప్పిన విషయం ఆందోళన చెందిస్తోంది.
అయితే రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.
గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.