• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » త్వరలో ఎన్నికలు.. బీజేపీని కలవర పరుస్తున్న అంశం ఇదే…!

త్వరలో ఎన్నికలు.. బీజేపీని కలవర పరుస్తున్న అంశం ఇదే…!

Last Updated: August 1, 2022 at 11:58 am

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ మంచి ఊపు మీద ఉంది. నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్ లో జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఓ విషయం బీజేపీ నేతలను కలవర పరుస్తోంది. రాష్ట్రంలో ఆపిల్ పండించే రైతులు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉండటం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 18 నుంచి 20 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆపిల్ రైతులు ప్రభావం చూపగలరు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బీజేపీ నేతలు తలమునకలయ్యారు.

ఆపిల్ రైతుల సమస్యలు..
ఇటీవల ఇన్ పుట్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆపిల్ రైతుల ఆదాయాలకు గండి పడింది. ప్రభుత్వం పన్నులను అధికంగా పెంచడంతో తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్టు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు వ్యాపారుల, దళారుల దోపిడితో తాము ఆదాయాన్ని కోల్పోతున్నామని వాపోతున్నారు.

అంతే కాకుండా ఇటీవల కరువు, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆపిల్ పంట దెబ్బతిన్నది. ఆపిల్ పరిమాణం తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో ఆపిల్ కు చాలా తక్కువ ధర పలుకుతోంది. ఈ క్రమంలో తమను ఆదుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు.

ఆపిల్ రైతుల నిరసనలు…
ఆపిల్ పండించే రైతులకు సంబంధించిన 27 సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ మంచ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గతవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు మండిపడ్దాయి. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ నేతలతో సీఎం జయరాం ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ సమస్యల పరిష్కారానికి సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్న రైతులు
రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించకుండా కమిటీల పేరిట మరింత కాలాయాపన చేస్తుండటంపై రైతు సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కమిటీ సూచనలు చేసే సమయానికి ప్రస్తుత సీజన్ పూర్తవుతుందని రైతులు పేర్కొంటున్నారు.

రైతులు ప్రధాన డిమాండ్లు…
సంయుక్త కిసాన్ మంచ్ ఆధ్వర్యంలో రైతులు ముఖ్యమంత్రికి 20 డిమాండ్లతో కూడిన మెమోరాండంను సమర్పించారు. అందులో ప్యాకేజింగ్ మెటీరియల్స్ పై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌ను నియంత్రించేందుకు అన్ని ఏ,బీ,సీ రకాల ఆపిల్స్ కు మద్దతు ధరను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇరాన్, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆపిల్స్ పై దిగుమతి సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ఇన్ పుట్ రేట్లను తగ్గించాలని, రైతులకు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల్లో ఆపిల్ రైతుల ప్రభావం….
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆపిల్ రైతుల ప్రభావం చూపనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కిన్నౌర్, సిమ్లా, సిర్మౌర్, సోలాన్, కులూ, చంబాలోని పలు ప్రాంతాల్లో ఆపిల్ రైతుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ రైతులను సంతృప్తి పరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

Primary Sidebar

తాజా వార్తలు

మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటేనే..!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

మహ్మద్ ప్రవక్త చిత్రం గీయడం ఇస్లాంలో ఎందుకు నేరంగా భావిస్తారు…?

స్కూల్ బస్సుపై దుండగుల దాడి.. !

నిద్ర లేచిన వెంటనే పిడికిలి ఎందుకు బిగుసుకోదు…?

గౌతమ్ అదానీకి జెడ్ ప్లస్ భద్రత…!

పళని స్వామికి షాక్…!

రోహింగ్యాలను వెనక్కి పంపండి..!

ముస్లింలు గడ్డం ఎందుకు పెంచుకుంటారు…?

బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నూతన కమిటీలు నియామకం…!

నా అభిప్రాయం త‌ప్ప‌ని తెలుసుకున్నా..!!

కేసీఆర్ కిట్ నుంచి టాల్కం పౌడర్ ఔట్?

ఫిల్మ్ నగర్

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

నా అభిప్రాయం త‌ప్ప‌ని తెలుసుకున్నా..!!

నా అభిప్రాయం త‌ప్ప‌ని తెలుసుకున్నా..!!

మనీలాండరింగ్​ కేసులో దోషిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

మనీలాండరింగ్​ కేసులో దోషిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో...!

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో…!

అత‌నంటే ఇష్టం: అన‌న్య పాండే

అత‌నంటే ఇష్టం: అన‌న్య పాండే

మ‌హాన‌టిగా ఆమెను వ‌ద్ద‌న్నాను!!

మ‌హాన‌టిగా ఆమెను వ‌ద్ద‌న్నాను!!

ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌నితో సినిమాలు చేయ‌ను!!

ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌నితో సినిమాలు చేయ‌ను!!

నా జాస్మిన్ ఆనందంగా క‌నిపించ‌డం లేదు!!

నా జాస్మిన్ ఆనందంగా క‌నిపించ‌డం లేదు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)