బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టెస్టు ఇందౌర్ లో ప్రారంభమైంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించి జోరు మీద ఉన్న రోహిత్ సేన.. మూడో టెస్టులో మాత్రం కాస్త తడబడింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 33.2 ఓవర్లలోనే కేవలం 109 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు శుభమన్ గిల్ మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారంతా విఫలమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో కున్ మెన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. లైయన్ మూడు వికెట్లు తీయగా.. మర్ఫీ ఒక్ వికెట్ పడగొట్టాడు. ఇక, పరుగుల వీరుడు కింగ్ కోహ్లీకి స్వదేశంలో 200వ అంతర్జాతీయ టెస్ట్ ఇది.తన ప్రత్యేకమైన టెస్టులో విరాట్ నిరాశపర్చాడు.
మర్ఫీ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో విరాట్ భారీ స్కోరు చేసి చాలా కాలమైంది. 2020 నుంచి అతడు ఈ ఫార్మాట్ లో సెంచరీ నమోదు చేయలేదు. గత ఏడాది ఆరు మ్యాచుల్లో 256 పరుగులు మాత్రమే చేశాడు.