• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » ఒకప్పుడు ఏబీవీపీని హేళన చేశారు.. కానీ ఇప్పుడేమైంది!

ఒకప్పుడు ఏబీవీపీని హేళన చేశారు.. కానీ ఇప్పుడేమైంది!

Last Updated: June 16, 2022 at 9:03 pm

భారతదేశం సత్యమేవ జయతే నినాదాన్ని నమ్ముతుందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. హైదరాబాద్ లోని తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ ఆఫీస్ స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం వేద పండితులు మోహన్ భగవత్ కు ఆశీర్వచనం అందజేశారు. తర్వాత కార్యాలయాన్ని సందర్భించారు. అక్కడ చనిపోయిన ఏబీవీపీ కార్యకర్తల ఫోటోలను సందర్శించి.. వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభాస్థలికి వెళ్లారు మోహన్ భగవత్.

వందసార్లు అబద్ధాలు చెబితే అది నిజం అవుతుందంటారు కానీ.. మన దేశంలో మాత్రం అది నిజం కాదని చెప్పారు. ఎందుకంటే మనం సత్యమేవ జయతే నినాదాన్ని నమ్ముతామని చెప్పారు. ఒకప్పుడు ఏబీవీపీని చూసి అవహేళన చేశారని.. కానీ.. ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈ భవనాన్ని నిర్మించుకున్నారని.. దీనికోసం అనేక మంది కార్యకర్తలు బలిదానాలు చేశారన్నారు.

రాజనీతిలో విజయం సాధించే వారిపై వ్యతిరేకులు అంతే స్థాయిలో పెరుగుతారన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. తమకు ఎలాంటి మెంటర్ లేడని.. చెప్పేవాడు లేడని అయినా తమకు అనుభవం ఉందని చెప్పారు. సొంతంగానే ఎదిగాం.. కార్యకర్తల సత్తాతో నిలబడ్డామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి గొప్పతనం గురించి వివరించారు. తండ్రి వ్యాఖ్య పరిపాలన చేసిన వారిని 8 వేల ఏళ్లు అయినా ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని అన్నారు. యూపీలో ఇప్పటికీ కొన్ని మైళ్ల దారిలో ఎవరూ నడవరని తెలిపారు. ఎందుకంటే సీతాదేవి పాదయాత్ర చేసే సమయంలో కాళ్ల నుంచి రక్తం వచ్చిందని.. అందుకే ఆ ప్రాంతంలో వ్యవసాయం కూడా చేయరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

విద్యార్థులకు మౌలిక వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన

మీనా భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై అంతిమ సంస్కారాల్లో..

ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన

బ్రేకింగ్.. బలపరీక్షకు ముందే ఉద్ధవ్ రాజీనామా!

రియల్ శ్రీమంతుడితో.. రీల్ శ్రీమంతుడు!

బల పరీక్షనా….. రాజీనామానా… !

మైగ్రేన్ సంకేతాలు ఎలా ఉంటాయి…? మైగ్రేన్ వచ్చినప్పుడు బండి డ్రైవ్ చేయవచ్చా…?

స్మాల్ గోల్డ్ స్మగ్లర్స్…. వీడియో వైరల్

అగ్నిపథ్ కు విశేష స్పందన.. భారీగా వస్తున్న దరఖాస్తులు

పరిహారం ఎటూ తేల్చని కౌన్సిల్ సమావేశం

పులిపిరులు ఎలా వస్తాయి…? అవి నిజంగా అంటు వ్యాదేనా…?

ఉల్లిపాయతో నిజంగా జ్వరం వస్తుందా…?

ఫిల్మ్ నగర్

మీనా భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై అంతిమ సంస్కారాల్లో..

మీనా భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై అంతిమ సంస్కారాల్లో..

రియల్ శ్రీమంతుడితో.. రీల్ శ్రీమంతుడు!

రియల్ శ్రీమంతుడితో.. రీల్ శ్రీమంతుడు!

పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండిరా బాబూ!

పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండిరా బాబూ!

షెహ్నాజ్​ ట్రెజరీకి ప్రోసోపాగ్నోసియా వ్యాధి.. ఇది సోకితే అది త‌ప్ప‌దు..!

షెహ్నాజ్​ ట్రెజరీకి ప్రోసోపాగ్నోసియా వ్యాధి.. ఇది సోకితే అది త‌ప్ప‌దు..!

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ని ఎందుకు రాజమౌళి వద్దన్నారు ?

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ని ఎందుకు రాజమౌళి వద్దన్నారు ?

RGV కోసం మూడు నెలలు వెయిట్ చేసిన చిరు ! ఆ మూవీని ఎందుకు మధ్యలోనే ఆపేసారు ?

RGV కోసం మూడు నెలలు వెయిట్ చేసిన చిరు ! ఆ మూవీని ఎందుకు మధ్యలోనే ఆపేసారు ?

మీనా ఇంట విషాదం.. భ‌ర్త విద్యాసాగ‌ర్ మృతి..!

మీనా ఇంట విషాదం.. భ‌ర్త విద్యాసాగ‌ర్ మృతి..!

ఎక్స్ క్లూజివ్.. పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్

ఎక్స్ క్లూజివ్.. పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)