కోహ్లీ రికార్డును టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ బద్దలు కొట్టారు. హైదరాబాద్ ఉప్పల్ స్డేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో సెంచరీతో చెలరేగి పోయాడు. వన్డేల్లో గిల్ కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. అలాగే భారత జట్టు తరపున అత్యధిక వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు గిల్.
వన్డే కెరీర్ లో ఆడిన 19 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైలు రాయిని చేరుకుని విరాట్ కోహ్లీ, 24 ఇన్నింగ్స్ తో శిఖర్ ధావన్ పేరు మీదున్న రికార్డులను తిరగ రాశాడు. అయితే పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ 18 ఇన్నింగ్స్ తో అందరికంటే ముందు ఉన్నాడు.
బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్ ను కాదని ఓపెనర్ గా శుభ్ మన్ కి అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. కానీ విమర్శలకు సమాధానం చెబుతూ వరుస సెంచరీలతో గిల్ దుమ్మురేపుతున్నాడు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ సెంచరీ బాదాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్. లేటెస్ట్ గా ఉప్పల్ మ్యాచ్ లోనూ 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి షాక్ కి గురి చేశాడు శుభ్ మన్ గిల్.