దేశంలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా తాజా గణాంకాల ప్రకారం మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య… 3,33,16,755కి చేరింది. అలాగే ఇందులో 3,25,22,171 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,51,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 284 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,43,497 మంది చనిపోయారు. అలాగే గడిచిన 24 గంటల్లో 38,012 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.