ఇండియా లో కరోనా కేసుల సంఖ్య అస్సలు తగ్గటం లేదు. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 30,773 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 3,34,48,163 కి చేరింది. అలాగే ఇందులో 3,26,71,167 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ప్రస్తుతం 3,32,158 కేసులు యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 309 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,44,838 మంది కరోనాతో మృతి చెందారు.