ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ మార్చిలో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. బడ్జెట్ సెషన్ రెండో భాగాన్ని పార్లమెంట్ నూతన భవనంలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా పార్లమెంట్కు సంబంధించిన లే అవుట్, ఫోటోలను కేంద్రం విడుదల చేసింది. సెంట్రల్ విస్టా రీ డెవలప్ మెంట్ ప్రణాళికలో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపడుతోంది.
ఈ నూతన భవనంలో అత్యంత విశాలమైన హాల్స్, లైబ్రరీతో పాటు పార్కింగ్కు కావాల్సినంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. హాల్స్, ఆఫీసు గదులను ఆధునిక టెక్నాలజీకి తగినట్టుగా నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్లు సామర్థ్యంతో లోక్సభ హాల్ను నిర్మించారు.
ఇక రాజ్యసభ హాల్ను లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే విధంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనానికి సమీపంలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. కొత్త బిల్డింగ్ 65వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.