అవినీతి సూచీలో భారత్ 85వ స్థానంలో ఉంది. బెర్లిన్కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ (Transparency International) ఈ లిస్ట్ ను విడుదల చేస్తుంది. 180 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచదేశాలు ఎక్కువగా అవినీతి నిర్మూలనలో విఫలమయ్యాయని తెలిపింది. దీంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. గత పదేళ్లలో ప్రపంచంలో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనకు పెద్దగా చర్యలు తీసుకోలేదని వివరించింది.
ఈ సంస్థం ఆయా దేశాల్లో కరప్షన్ కి వ్యతిరేకంగా తీసుకున్న చర్యల నేపథ్యంలో సీపీఐ (కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్) స్కోర్ వేస్తారు. ఈ స్కోర్ బట్టి ఆ దేశాల రేకింగ్స్ కేటాయిస్తారు. 0 నుంచి 100 సీపీఐ స్కోరు ఉంటుంది. స్కోరు 0 గా ఉంటే అవినీతి శూన్యం అని అర్థం. స్కోరు 100 ఉంటే.. అత్యంత అవినీతి ఉన్నట్టుగా ఈ నివేదిక చెబుతుంది. భారత్ గతంలో వలే 40సీపీఐ స్కోరుతో 85వ స్థానంలో నిలిచింది. అవినీతిపై పోరాటంలో భారత్ లో కూడా పురోగతి సాధించలేదని ఈ నివేదిక తేల్చింది. అటు దాయాది పాకిస్తాన్ పరిస్థితి మరింత దారణంగా ఉంది. 2020లో 31 సీపీఐ స్కోరుతో 124వ స్థానం ఉన్న పాక్.. ఈ ఏడాది 28 సీపీఐతో 140వ స్థానానికి పడిపోయింది.
88 సీపీఐ స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి. భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్ ఉన్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది.