భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. వాన కారణంగా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితిలో మ్యాచ్ ను రద్దు చేశారు అంపైర్లు. దీనితో ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమం అయింది.
టాస్ పడిన కాసేపటికే వర్షం మొదలవడంతో మ్యాచ్ ను ఆలస్యంగా ప్రారంభించారు. అయితే.. సమయానుకూలంగా 20 ఓవర్లు జరగాల్సిన ఆటను 19 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్ కు దిగారు. 3.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం పలకరించింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడక తప్పలేదు. ఆ తర్వాత భారీగా కురిసిన వర్షం కారణంగా ఆట నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడింది. దీంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మైదానాన్ని సిద్ధం చేశారు. అయితే.. మ్యాచ్ మొదలైన కాసేపటికే మళ్లీ వర్షం పడడంతో ఆటగాళ్లు, అంపైర్లు మైదానాన్ని వీడారు.
టీమిండియా 3.3 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు చేసిన దశలో మొదలైన వర్షం చాలాసేపు కొనసాగింది. దాంతో స్టేడియం అంతా జలమయమైంది. ఓవర్లు తగ్గించి అయినా.. మ్యాచ్ జరిపే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్టున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్ లో చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. అయితే.. ఈ సీరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిసిన భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.