ఇంగ్లండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ జట్టను ప్రకటించింది. ఈసారి వన్డే సిరీస్కు భారత్ జట్టులో కొన్ని మార్పులు చేసి… కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. మొదటిసారి వన్డే జట్టులో సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు దక్కింది. తొలి టీ20లోనే ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ ఇక వన్డేల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాకు టీమ్లో చోటు దక్కింది. ఇక భారత్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో కోలుకున్న తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. షమి, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి కోలుకపోవడంతో.. వాళ్ల పేర్లను బీసీసీఐ పరిశీలించలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో పేలవ ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, సంజు శాంసన్లు చోటు కోల్పోయారు.
బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, చాహల్, కుల్దీప్, కృనాల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్