• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » అవసరమైతే తప్ప బయటకు రాకండి.. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

అవసరమైతే తప్ప బయటకు రాకండి.. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

Last Updated: October 10, 2022 at 8:49 pm

ఉక్రెయిన్ పై రష్యా రాకెట్లు, క్షిపణి దాడులతో విరుచుకు పడడంతో.. రాజధాని కీవ్ సహా అనేక నగరాల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. రష్యా దాడుల్లో చాలామంది మరణించారని, 60 మందికి పైగా గాయపడ్డారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మరిన్ని దాడులు తప్పవని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్స్ ఎవరూ అత్యవసరమైతే తప్ప ఈ దేశంలో ప్రయాణాలు చేయరాదని ఇక్కడి భారత రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది.

ఇదే సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన సేఫ్టీ గైడ్ లైన్స్ ని కూడా ఏ మాత్రం అలక్ష్యం చేయరాదని పేర్కొంది. ఈ యుద్ధ భూమిలో మీ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని కోరింది. నిన్న మొన్నటివరకు దాదాపు ప్రశాంతంగా ఉన్న కీవ్ నగరంలో ఇప్పడు ఎక్కడ చూసినా దగ్ధమైన కార్లు, ఇతర వాహనాలు, దెబ్బ తిన్న భవనాలు కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ పై తాము 83 మిసైల్స్ ని ప్రయోగించినట్టు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. తమ దేశాన్ని కలుపుతున్న క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ దళాలు పేల్చి వేయడంతో పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఉక్రెయిన్ లోని పరిస్థితిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తూ..వైషమ్యాలు మంచిది కాదని, తక్షణమే వీటికి స్వస్తి చెప్పి సాధారణ పరిస్థితి నెలకొనేలా దౌత్యపరమైన చర్చలకు కూర్చోవాలని సూచించింది. రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా.. ఉద్రిక్తతల నివారణకు జరిగే ఏ ప్రయత్నానికైనా తాము సహకరిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కీవ్ లోని భారతీయులు అవసరమైతే కాంటాక్ట్ చేయడానికి వీలుగా ఈ-మెయిల్స్, ఫోన్ నెంబర్లు, , వెబ్ సైట్లు, ఫేస్ బుక్ వివరాలను వెల్లడించింది.

Primary Sidebar

తాజా వార్తలు

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఓటర్ తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ట్విస్ట్.. మరో ఉద్యోగి హస్తం!!

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ చేసింది వాళ్ళిద్దరే!

పాలించే రాజుకు వ్యతిరేకత తప్పదు..!

అందరి ప్రాణాలు కాపాడి.. ఆస్పత్రిపాలైన సూపర్ పోలీస్

మోడీపై వివాదాస్పద పోస్టర్ల కలకలం… 100 ఎఫ్ఐఆర్లు నమోదు..!

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap