• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » విదేశీ వలసదారుల్లో ‘భారతీయ ప్రభంజనం’

విదేశీ వలసదారుల్లో ‘భారతీయ ప్రభంజనం’

Last Updated: January 6, 2023 at 12:43 pm

ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నవారిలో భారతీయులే ఎక్కువని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల సంఖ్య.. 18 మిలియన్ల వరకు ఉందని తెలుస్తోంది. ఆ తరువాత 11.2 మిలియన్లతో మెక్సికో, 10 మిలియన్ల చొప్పున రష్యా, చైనా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మెక్సికన్లలో చాలామంది అమెరికాలో స్థిర పడినా ..వారిలా కాకుండా భారతీయులు అమెరికాతో బాటు పలు ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చెందారు.

Indians lead world when it comes to settling abroad | India News - Times of India

అరబ్ దేశాల్లో బ్లూ కాలర్ వర్కర్ల స్థాయి నుంచి ఇతర పారిశ్రామిక దేశాల్లో విద్యార్థుల వరకు అంతా ఇండియన్స్ ఉన్నారని ఈ రిపోర్టు పేర్కొంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండు దేశాల కన్నా వీరి సంఖ్య అత్యధికం. 2020 లో కరోనా పాండమిక్ ఉన్నప్పటికీ 0. 7 మిలియన్లకు పైగా భారతీయులు ఇతర దేశాలకు వెళ్లారు. 2022 సంవత్సరానికి ఇది 1.3 మిలియన్లకు పెరిగింది. గల్ఫ్, తూర్పు ఆసియా దేశాలకు వెళ్లేందుకు అనేకమందికి ఈసీఆర్ పాస్ పోర్టులను అధికారులు జారీ చేశారట.

వీరిలో స్కూలు చదువు పూర్తి చేయనివారు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం 0.1 మిలియన్లకు పైగా భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాల్లో స్థిరపడుతున్నారు.2011 నుంచి 1.6 మిలియన్ల మంది తాము స్థిర పడిన దేశాల పౌరసత్వం తీసుకున్నారట. 2021 లో ప్రవాస భారతీయుల నుంచి ఇండియాకు 89 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం అందిందని అంచనా. ఇండియా తరువాత మెక్సికో వాసులు తమ దేశానికి 54 బిలియన్ డాలర్లు, చైనీయులు తమ దేశానికి 53 బిలియన్ డాలర్లు పంపితే నైజీరియా వాసులు తమ దేశానికి 19 బిలియన్ డాలర్లు మాత్రం పంపారని ఈ నివేదిక వివరించింది.

వివిధ పనులు, ఉద్యోగాల కోసం, ఇతర వృతిగతమైన వాటి కోసం 2020 లో ఇండియా నుంచి విదేశాలకు 7.2 లక్షలమంది వెళ్తే.. 2021 లో ఇది 8.3 లక్షలకు, 2022 లో 13.0 లక్షలకు పెరుగుతూ వచ్చింది. భారతీయ మేధస్సుకు విదేశాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని తెలుస్తోంది.

‘

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap