భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల 50 మీ. రైఫిల్ 3 స్థానాల బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
ఇది ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ రెండవ షూటింగ్ ప్రపంచ కప్ బంగారు పతకం. న్యూఢిల్లీలో జరిగిన 2021 ప్రపంచకప్ లో తొలిసారిగా బంగారు పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో 22 ఏళ్ళ ప్రతాప్ సింగ్ 16-6 తో అలెగ్జాండర్ షిమిర్ల్ పై గెలుపొందారు.
ఇక ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్ లో షిమిర్ల్, ప్రతాప్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరారు. భారత్ కే చెందిన అఖిల్ షెరాన్ ఏడో ర్యాంక్ లో నిలిచాడు. మహిళల 25 మీటర్ పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ రెండో ర్యాంకింగ్ మ్యాచ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ కే చెందిన మను భాకర్, ఇషా సింగ్ క్వాలిఫయింగ్ లో వరుసగా 32వ, 34 వ స్థానాల్లో నిలిచారు.