• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఏపీ నుంచి తరలిపోతున్న ”కియా” కార్ల కంపెనీ..?

ఏపీ నుంచి తరలిపోతున్న ”కియా” కార్ల కంపెనీ..?

Last Updated: February 6, 2020 at 2:28 pm

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందనే వార్త చర్చానీయాంశంగా మారాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ కథనాన్ని మొదట ప్రచురించడంతో సంచలనంగా మారింది. కియా మోటార్స్ కంపెనీ ఏపీ నుంచి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతుందని దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు ప్రారంభమయ్యాయని సంస్థ తెలిపింది. ఏపీలో కంపెనీ నడపడానికి తమకు సమస్యలు ఎదురవుతున్నాయని..అందుకే తరలిపోవాలనే నిర్ణయించుకున్నట్టు తమిళనాడుకు చెందిన ఓ ఉన్నత స్థాయి అధికారి ఈ విషయాన్ని దృవీకరించినట్టు కూడా రాయిటర్స్ వెల్లడించింది. తమిళనాడులో కియా అనుబంధ సంస్థ అయిన హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది. హ్యుందాయ్ ద్వారా వారు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ విషయంపై అటు తమిళనాడు ప్రభుత్వం గాని..ఏపీ ప్రభుత్వం గాని స్పందించలేదు.

 

కియా కంపెనీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏపీ లోని అనంతపురంలో ప్లాంట్ ను నెలకొల్పారు. పనులు కూడా ప్రారంభమై కార్లను మార్కెట్లోకి కూడా తీసుకొచ్చిది. అయితే ఆకస్మాత్తుగా కంపెనీని తరలివెళ్లడానికి కారణాలు వై.ఎస్ ప్రభుత్వ వైఖరే అని తెలుస్తోంది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో పాటు గత ప్రభుత్వం కియాకు కల్పించిన రాయితీలపై ప్రోత్సకాలు (ఆర్ధిక ప్రోత్సకాలు, విద్యుత్ సంబంధ పన్నులు, భూముల కొనుగోళ్ల విషయం) జగన్ ప్రభుత్వం సమీక్ష చేయాలని భావించడమేనట.

తమిళనాడుకు ప్లాంట్‌ను తరలిస్తే లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయని కియా కంపెనీ భావిస్తోందట. ప్లాంట్ తరలింపుపై ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకపోయినా.. కియా ఎంత త్వరగా ఏపీ రాష్ట్రం నుంచి బటయకు వెళ్లాలని ఆలోచిస్తుందట. ప్లాంట్ తరలింపు చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని తెలిసింది.

Advertisements

అయితే కియా కంపెనీ తరలింపు అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. కియా మాత్రమే కాదు ఏ కంపెనీ అయినా ఒక చోట నుంచి మరో చోటికి తరలించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మంటున్నారు నిపుణులు. రెండేళ్ల క్రితం అనంతపురంలో 12 వేల మంది ఉద్యోగులతో సంవత్సరానికి మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి టార్గెట్ గా భారీ పెట్టుబడితో నెలకొల్పిన ప్లాంట్ ను ఇప్పుడు ఎకాఎకిన తరలించడానికి ఎందుకు నిర్ణయం తీసుకుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కియా సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

రాయిటర్స్ లో వచ్చిన ఈ వార్తను టీడీపీ, జనసేన కార్యకర్తలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ కియా కంపెనీ వెళ్లిపోతుందంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే రాయిటర్స్ కథనంపై వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సర్వీస్ ఛార్జ్ విధించడం నిషేధం..

సైదిరెడ్డి.. ఎందుకీ కక్కుర్తి!

న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. ఇబ్బందుల్లో ప్ర‌జ‌లు..

వారికి భ‌ర్త శ‌త్రువుతో స‌మానం..!!

బుమ్రా అకౌంట్లో మ‌రో రికార్డు..

కాఫీలు అందించిన ట్విట్ట‌ర్ సీఈవో..!!

చేత‌నైతే ప‌ట్టుకోండి చూద్దాం..!!

డోర్నకల్ టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు

కేబినెట్ విస్తరణ… మంత్రులుగా ఐదుగురు ప్రమాణం…!

కుక్క మొరిగింద‌ని..!?

కాంగ్రెస్‌ లో చేరిన టీఆర్‌ఎస్‌ మేయర్‌!

సుశాంత్ సింగ్ రూమ్ మేట్ కు ఊరట…!

ఫిల్మ్ నగర్

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

కాళీ పోస్టర్ వివాదాస్పదం... !

కాళీ పోస్టర్ వివాదాస్పదం… !

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

'మాచర్ల..' సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

‘మాచర్ల..’ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

ఎప్పుడో ఆగిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకొచ్చింది

ఎప్పుడో ఆగిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకొచ్చింది

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)