ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను ఫోన్ చేసి బెదిరించడం సరికాదని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదన్నారు. చెరుకు సుధాకర్ ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. తాము కూడా ఈ అంశాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ చేపట్టిన హథ్ సే హథ్ జోడో పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు.
ఈనెల 9న కరీంనగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ హాజరుకానున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగానే కరీంనగర్ లో సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్.