హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
క్రిస్టియన్ మిషనరీల మీద అధికారులు ఒక్కసారిగా దాడులు జరపటం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, మెదక్, పటాన్ చెరులో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బాలవికాస్ ఫౌండేషన్ లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. 2016లో బాలవికాస్ ఫౌండేషన్ ఏర్పాటైంది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో ఎన్జీవోగా బాల వికాస్ రిజిస్టర్ అయ్యింది. కాగా.. ఇటీవలి కాలంలో ఐటీ హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులను ముమ్మరం చేసింది. పలు సంస్థలపై దాడులు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగి కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.