కమిషనర్ చెప్పి ఇలా వెళ్లారో లేదో ఆస్పత్రిలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. రోగులు, గర్భిణీల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్ కుమార్ హెచ్చరించిన కాసేపటికే ఆసుపత్రిలోని సిబ్బంది వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గర్భిణీలు, పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో వైద్య విధాన పరిషత్ కమీషనర్ తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను పేషంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. పేషంట్స్ పట్ల మెలగాల్సిన విధానాన్ని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
పేదవారికి సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యతను వైద్యులదని, ఈ విషయం మరువద్దని తెలిపారు. గర్భిణీలకు, సామాన్య రోగులకు ఒకే క్యూ లైన్ కాకుండా వేరు వేరు ఓపీలు అందించాలన్నారు. అలాగే బాలింతలు రెండవ ప్లోర్ నుండి గ్రౌండ్ ప్లోర్ కు వచ్చి క్యూ లైన్ లో నిల్చొని టెస్ట్ లు చేయించుకునే పరిస్థితిపై అక్కడున్న పేషంట్స్ బంధువులు తెలపడంతో ఇక నుండి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఆస్పత్రిలో కొనసాగుతున్న ప్రైవేట్ పెయిడ్ పార్కింగ్ కూడా తీసేస్తామన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుందని, అవి పేదలకు అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని.. అలా చేసినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అజయ్ కుమార్.
అయితే కమీషనర్ అలా చెప్పి ఇలా బయటకు వెళ్లారో లేదో.. దవఖానాలో మళ్లీ అదే తీరు ప్రత్యక్ష్యమయింది. వైద్యం కోసం వచ్చిన ఓ గర్భిణీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు టెస్టుల కోసం వెయిట్ చేసి, ఓపిక లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దీంతో వైద్య సిబ్బంది తీరుపై పేషెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి చెప్పినా కూడా ఆస్పత్రి సిబ్బంది వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.