హిమాచల్ ప్రదేశ్ లో వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. రిక్ కాంగ్ పియో – సిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ దగ్గర జరిగిందీ ఘటన. ఓ బస్సు, ట్రక్కుపై కొండచరియలు పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.
శిథిలాల కింద 40 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇటీవల పలు ఘటనల్లో కొందరు చనిపోయారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported came under the rubble. Many people reported trapped. ITBP teams rushed for rescue. More details awaited. pic.twitter.com/ThLYsL2cZK
— ITBP (@ITBP_official) August 11, 2021