• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ముచ్చటగా మూడోసారి కూడా మోడీనే..!ఎందుకంటే?

ముచ్చటగా మూడోసారి కూడా మోడీనే..!ఎందుకంటే?

Last Updated: January 27, 2023 at 11:09 am

లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమియే అని,ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీయే అని ‘ఇండియా టుడే’ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధానిగా మోడీ పని తీరు పట్ల 72 శాతం మంది సంతృప్తిని వ్యక్తపర్చడమే అందుకు కారణం. ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ పేరుతో సీవోటర్ తో కలిసి ‘ఇండియా టుడే ‘ఈ సర్వే ను నిర్వహించింది.

ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్థిక అంశాలను, చైనా ముప్పును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం బాగానే వ్యవహరించిందని వారు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికలు జరిగితే భాజపా 284 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.

కాంగ్రెస్ కి 191 స్థానాలు రావచ్చని తెలిపింది. అయితే ప్రధాని మోడీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇండియా టుడే అంచనాల్లో తేలింది. ఆయన పనితీరు పట్ల 72 శాతం మంది సంతృప్తి వ్యక్తపరిచారు. ద్రవ్యోల్బణం,కరోనా ప్రభావం, చైనా దురాక్రమణల ముప్పు వంటివి ఉన్నా ప్రజా వ్యతిరేకతను ఎన్టీయే సర్కార్ అధిగమించింది. మూడింట రెండొంతుల మంది ప్రజలు ప్రభుత్వం పై సంతృప్తితో ఉన్నారు. 2022 ఆగష్టులో 11 శాతం మంది మాత్రమే సంతృప్తితో ఉండడం గమనార్హం. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్త పరిచినవారు అప్పుడు 37 శాతం ఉంటే ఇప్పుడు 18 శాతం మాత్రమే ఉన్నారు.

దేశంలో 1,40,917 మంది నుంచి అభిప్రాయాలను ఇండియా టుడే తెలుసుకుంది. మరో 1,05,008 మంది ఇంటర్వ్యూలను సివోటర్ అదనంగా తీసుకుంది. ఏ అంశాలను ఎన్డీయే విజయాలుగా భావిస్తున్నారనే ప్రశ్నకు 20 శాతం మంది ప్రజలు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం గురించి చెప్పారు. 370వ అధికరణం రద్దు గురించి 14 శాతం మంది, అయోధ్యలో రామ మందిర నిర్మాణ కోసం 12 శాతం మంది చెప్పారు.

జోడో యాత్రలోకాంగ్రెస్ జాతకం మారదని 37 శాతం మంది, ప్రజలతో విస్తృతంగా అనుసంధానం అయ్యేందుకు ఈ యాత్ర  ఓ గొప్ప ప్రయత్నమని 29 శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ పునరుజ్జీవానికి రాహుల్ గాంధీ తగిన వ్యక్తి అని 26 శాతం, సచిన్ ఫైలెట్ పేరును 17 శాతం మంది సమర్థించారు.

Primary Sidebar

తాజా వార్తలు

పనివాడికి 10 కోట్ల లాటరీ…!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

నేను అలా చెప్పడం ఆపను.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

10 గంటలు.. పదుల్లో ప్రశ్నలు

అయోధ్యలో ఘనంగా ‘శ్రీరామ నవమి’ వేడుకలు

ధీరేంద్ర స్వామీజి‘ దివ్య దర్బార్’లో భారీ చోరీ…!

బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ

తుస్సుమన్న కేజ్రీవాల్ యత్నం.. థర్డ్ ఫ్రంట్ ‘మిథ్య’ !

ఇంకా ఈడీ ఆఫీస్ లోనే కవిత

ఫిల్మ్ నగర్

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ ...!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ …!

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

kangana warning board becomes talk of town

హద్దు మీరితే కాల్చిపడేస్తా!

wedding photos deleted is there a difference between niharika and chaitanya

మరోసారి తెర మీదకు మెగా డాటర్‌ విడాకుల మ్యాటర్!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap