జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే రష్మీ సోషల్ మీడియా వేదికగా కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్తుంది. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని…లాక్ డౌన్ ను పాటించాలని కోరుతోంది. కాగా,కరోనాపై పోరాటం చేస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ తారలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు తమ వంతు సహాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే సినీ కళాకారులకు కూడా విరాళం ప్రకటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా కరోనాపై యుద్ధం చేస్తోన్న కేంద్రానికి తన వంతు బాధ్యతగా సహాయం చేసేందుకు యాంకర్ రష్మీ ముందుకు వచ్చింది. తన వంతు బాధ్యతగా రష్మి 25 వేల రుపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. దానికి సంబందించి ఓ ట్వీట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాన మంత్రి సహాయనిధికి తన వంతుగా విరాళం ఇచ్చానని తెలిపింది. అంతేకాదు మీవంతుగా కూడా అంతో ఇంతో సాయం చేయాలనీ కోరింది.
I have donated 25000 as of now
will be doing my bit by donating to a few honest NGO's too while I use my resources too feed the hungry voiceless around
Requesting one and all to do there bit too come forward and help in which ever way possible pic.twitter.com/yYHiq4LZm1— rashmi gautam (@rashmigautam27) March 30, 2020