ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్ కు అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి.
జగన్ కు మినహాయింపు ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని తెలిపింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ వివరించింది. వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.