• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఊసే ఎత్తని మనిషి… ఉనికి మాత్రం ఉంచుతారా..?

ఊసే ఎత్తని మనిషి… ఉనికి మాత్రం ఉంచుతారా..?

Last Updated: August 21, 2019 at 10:27 am

విజయవాడ: రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడూ నోరు మెదపలేదు. ఎన్నికల ముందుగానీ, ఆ తరువాత గానీ ఆయన ఆ పేరు ఎప్పుడూ ప్రస్తావించలేదు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వచ్చినా ఆయన మాత్రం రాలేదు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారు ఒకరిద్దరు ‘‘రాజధాని అమరావతిని మార్చం’’ అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారని ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి. దానిపై అనేక చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ పార్టీ అగ్రనేత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజధాని అమరావతిని మార్చం అనిగానీ, మారుస్తాం అని గానీ లేదా పలానా చోట నిర్మిస్తామని గానీ ఏనాడూ చెప్పలేదు. అంటే ఆయన దృష్టిలో ఏదో నిగూఢమైన ఆలోచన ఉన్నట్లు అర్ధమవుతోంది. అమరావతిని ఎవరు నిర్మించినా ఆ పేరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్న అభిప్రాయం వారిలో ఉండే అవకాశం ఉంది. 2019-20 బడ్జెట్ లో కూడా అమరావతి నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర పథకాలకు వేల కోట్ల నిధులు కేటాయించారు. రాజధాని మౌలిక వసతులకు రూ.500 కోట్లు, అమరావతి కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. నిధుల కేటాయింపు వరుసక్రమంలో అమరావతికి 27వ స్థానం దక్కింది.

Amaravati

ప్రస్తుతానికి రాజధాని పనులు నిలిపివేశారు. ఆ పనులు చేసే కార్మికులు తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాజధానిని మరోచోటకు తరలిస్తారన్న ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో ఈ ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏదీ చేసే అవకాశంలేదని అంటున్నారు. అంతేకాకుండా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంలో మాట్లాడుతూ ఇంతటి వ్యయంతో రాజధాని నిర్మించే పరిస్థితుల్లో ప్రభుత్వంలేదని స్సష్టం చేశారు. మరో పక్క మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం సరైనదికాదని పరోక్షంగా అర్ధం వచ్చే విధంగా మాట్లాడారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అమరావతిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దాంతో ఈ అంశం పతాక శీర్షికలకెక్కింది. ప్రజల్లో అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో వారి పదవీకాలాన్ని రాజధాని నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా కొనసాగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Jagan Mohan Reddy

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

అన్నీ అవినీతి, కుటుంబ పార్టీలే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్

చిన్న పిల్లలకు నెయ్యి వేయడం మంచిదేనా…?

పొట్లకాయ కోడిగుడ్డు కలిపి తింటే ఏం జరుగుతుంది…?

అడ్డుకున్న మహిళలు.. తోసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే!

సారూ.. వయో పరిమితి పెంచండి.. రేవంత్‌ బహిరంగ లేఖ

అప్పట్లో సినిమా ప్రమోషన్ ఎలా ఉండేది…? తెలుగు వాళ్లకు సినిమా అంటే ఎందుకు అంత పిచ్చి…?

బడిపై కమ్ముకున్న..అవినీతి “మేఘా” లు !

సర్పంచ్‌ ల ధిక్కార స్వరం!

సాయి పల్లవి సక్సెస్ సీక్రెట్ ఏంటీ…? ఫాన్స్ కు ఎక్కడ కనెక్ట్ అయింది…?

సినిమాల‌ను త‌ల‌పించే జులుం..!

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

ట్రైన్ జర్నీ చేస్తున్నారా…? ఆ యాప్ ఉండాల్సిందే

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)