తెలుగు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నా పాన్ ఇండియా సినిమాలకు సైతం చెమటలు పట్టిస్తున్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. కాశ్మీరీ పండిట్ల ఊచకోతను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాకు దేశ నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అంతే స్పీడ్ గా విమర్శలు వస్తున్నాయి.
ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర గందరగోళం నెలకొంది. ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ లోను ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. థియేటర్ లో సినిమా నడుస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జై పాకిస్థాన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆగ్రహించిన ప్రేక్షకులు వారిపై దాడి చేశారు. దాంతో వారు పరారైనట్టు తెలుస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. అయితే.. మద్యం మత్తులో అలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కానీ.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కి పెరిగింది.
Advertisements
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్లవరకు వసూల్ చేసింది. అనుపమ ఖేర్.. మిథున్ చక్రవర్తి.. పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.