• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పవన్ ట్వీట్‌పై ప్రకంపనలు

Published on : September 23, 2019 at 11:48 am

పవన్‌కల్యాణ్ త్వరలో ఏదో బాంబు పేల్చబోతున్నారా? అధికార దుర్వినియోగంపై తాజాగా అతను చేసిన ట్వీట్ చూసినవాళ్లకి కలిగిన అనుమానం ఇది. అందులో ఎటువంటి వివరాలు లేవు. అధికార దుర్వినియోగం.. నిరంకుశ పాలన అనే మాటల్ని మాత్రమే వాడారు. అధికార దుర్వినియోగం ఏపీకి సంబంధించిన అంశంగా, నిరంకుశ పాలన తెలంగాణలో కేసీఆర్‌కు సంబంధించిన మేటర్‌గా పరిశీలకులు భావిస్తున్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా.. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలసీల్లోని లోపాలను చెప్పడం, జనసేన కార్యక్రమాలను ప్రకటించడం, వివిధ పుస్తకాలను అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పరిచయం చేయడం ఆయన చేస్తుంటారు. తాజాగా ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత శామ్యుల్ జాన్సన్ చెప్పిన మాటలను ట్వీట్ చేశారు. ‘‘ఏ ప్రభుత్వమూ అధికారాన్ని ఎక్కువ రోజులు దుర్వినియోగపరచలేదు. ప్రజలు ఏమాత్రం దాన్ని సహించలేరు. నిరంకుశ పాలనను అంతంచేసే శక్తి మనుషుల సహజ స్వభావంలోనే అభివ్యక్తమవుతుంటుంది. ఏ ప్రభుత్వాన్నుంచైనా అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది’’ అన్న శామ్యూల్ మాటలను యథాతథంగా ట్వీట్ చేశారు.

ఐతే, పవన్ చేసిన ట్వీట్ ఎవరికి సంబంధించిన ట్వీట్ అయివుంటుందా అని ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఇది కచ్చితంగా ఏపీలో జగన్ సర్కారును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోందని, సొంత మనుషులకు, సొంత పత్రికలో పనిచేసిన వారికి విచ్చలవిడిగా పదవులు, సర్కారు కొలువులు కట్టబెడుతున్నారని ఇటీవలి కాలంలో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.

ఇటు చూస్తే.. తెలంగాణలో తండ్రీ కొడుకుల నిరంకుశ పాలనపై కాంగ్రెస్, బీజేపీ చెరోవైపు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ఎవర్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారా అని జనం చర్చించుకుంటున్నారు. వోవరాల్‌గా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన అంశాల్నిఎండగట్టడంలో విఫలం అవుతుంటే, అసెంబ్లీలో ఒకే ఒక్క స్థానం వున్నప్పటికీ పవన్‌కల్యాణ్ ప్రజా వ్యతిరేక పాలనను చాలా గట్టిగా ఎదిరిస్తున్నారనే మాట పబ్లిక్‌లో వినిపిస్తోంది.

No Government power can be abused long.Mankind will not bear it….There is a remedy in human nature against tyranny, that will keep us safe under every form of Government.
– Samuel Johnson

— Pawan Kalyan (@PawanKalyan) September 23, 2019

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

జగ్గూభాయ్ పోస్ట్ వెనుకున్న అర్థం ఏమిటో ?

జగ్గూభాయ్ పోస్ట్ వెనుకున్న అర్థం ఏమిటో ?

అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సూర్య

అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సూర్య

Sai Dharam tej Republic Movie Released on April

అఫీషియ‌ల్- సాయిధ‌ర‌మ్ తేజ్ నెక్ట్స్ మూవీ రిప‌బ్లిక్

naga chaitnya

అమీర్ ఖాన్ మూవీలో నాగ చైత‌న్య‌…?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఎట్ట‌కేల‌కు పంచాయితీ ఎన్నిక‌ల‌కు వైసీపీ ఓకే

ఎట్ట‌కేల‌కు పంచాయితీ ఎన్నిక‌ల‌కు వైసీపీ ఓకే

హైద‌రాబాద్ లోనూ రైతుల ర్యాలీ- హైకోర్టు అనుమ‌తి

హైద‌రాబాద్ లోనూ రైతుల ర్యాలీ- హైకోర్టు అనుమ‌తి

కేటీఆర్ మంత్రివ‌ర్గంలో స్థానం ఆశిస్తున్న నేత‌లు వీరేనా...?

కేటీఆర్ మంత్రివ‌ర్గంలో స్థానం ఆశిస్తున్న నేత‌లు వీరేనా…?

సొంత కూతుళ్ల‌ను క్షుద్ర‌పూజ‌ల్లో బ‌లిచ్చిన ఈ గోల్డ్ మెడల్ త‌ల్లితండ్రుల స‌మాధానం ఏంటో తెలుసా?

క‌లి సంహరించ‌బ‌డ్డాడు.. నా బిడ్డ‌ల‌ని పోగొట్టుకున్నా!

ఆందోళ‌న చేస్తున్న రైతులు పాక్ నుండి వ‌చ్చారా...?

ఆందోళ‌న చేస్తున్న రైతులు పాక్ నుండి వ‌చ్చారా…?

ట్రాక్ట‌ర్ల ర్యాలీలో సంఘ‌విద్రోహా శ‌క్తులు చొర‌బ‌డొచ్చంటున్న పోలీసులు

ట్రాక్ట‌ర్ల ర్యాలీలో సంఘ‌విద్రోహా శ‌క్తులు చొర‌బ‌డొచ్చంటున్న పోలీసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)