జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోకి చేరుకోగానే మొదట యమదర్మరాజుకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం లక్ష్మీ నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ధర్మపురికి చేరుకున్న ఆయనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ నరసింహ క్షేత్రాల దర్శనం చేసుకుంటున్నారు.
ఆయన మొత్తం 32 నరసింహ క్షేత్రాలను దర్శనం చేసుకుంటారు. దర్శనాల్లో భాగంగా తొలి ఆలయంగా ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
అంతకుముందు ఈ రోజు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయం దగ్గర వేద మంత్రాల నడుమ వారాహికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.