జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో జనసేన శ్రేణులు పై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. రోడ్ల అధ్వాన స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా… పోలీసుల సమక్షంలో జనసేన నాయకుడు రామ్మోహన్ రావు పై దాడి చేయడాన్ని తప్పుబట్టారు జనసేనాని. సమస్యను తెలియజేసిన వారికి గాయపరచి…ఎదురు కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు.
జనసేన శ్రేణుల పై దాడి చేయడం చాలా బాధాకరం అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కారం కాదని…జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే స్వయంగా తానే రోడ్లపైకి వస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. ఆ పరిస్థితిని తీసుకురావద్దని హెచ్చరించారు.